News March 19, 2025
సిద్దిపేట: ఆర్థిక అక్షరాస్యత పురోభివృద్ధికి దోహదం: కలెక్టర్

ప్రతి వ్యక్తిలోని గుణాత్మకమైన ఆర్థిక అక్షరాస్యత స్థాయి వారి వ్యక్తిగత, కుటుంబాల అభివృద్ధికే కాకుండా, సమాజ ఆర్థికాభివృద్ధికి, దేశ సుస్థిరమైన పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో కళాశాల వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్.గోపాల సుదర్శనం రచించిన “ఫైనాన్షియల్ లిటరసీ” పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.
Similar News
News February 21, 2026
ZP ఛైర్మన్ ఫిర్యాదుతో విషయం బయటకు..!

అధికార పార్టీ నేతల అండదండలతో పలమనేరులో ఉపాధి హామీ పనుల్లో భారీ <<19204272>>అవకతవకలు<<>> జరిగాయని చిత్తూరు ZP ఛైర్మన్ కలెక్టర్ సుమిత్ కుమార్కు ఫిర్యాదు చేశారు. వేజెస్ రూపంలో అందించే నగదును ఏపీఓ, అసిస్టెంట్లు తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నివేదికను సమర్పించాలని డ్వామా పీడీకి కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
News February 21, 2026
పలమనేరు: నకిలీ బిల్లుల సృష్టి కర్తలు వీళ్లే..!

<<19204252>>నకిలీ బిల్లుల<<>> వ్యవహారంలో APO రవికుమార్, టెక్నికల్ అసిస్టెంట్ ఉషశ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉదయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరులోని అంబేడ్కర్ నగర్ బసాపురం పోస్టాఫీస్లో వారం రోజుల వ్యవధిలో 100కు పైగా అకౌంట్లు ఓపెన్ చేశారని ప్రాథమిక సమాచారం. ముందు చేసిన పనులకు బిల్లు పెట్టినట్లు కొన్ని, డమ్మీ మస్టర్ క్రింద మరి కొన్ని బిల్లులు పెట్టినట్లు సమాచారం.
News February 21, 2026
BREAKING: పాలమూరు: విషాదం.. యువకుడు సూసైడ్

నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఈరోజు గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.


