News January 7, 2026
సిద్దిపేట: ఆహారం భద్రంగా.. ఆరోగ్యం పదిలంగా !

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని, కల్తీలేని ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
Similar News
News January 8, 2026
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన వాయిదా

ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్లో మార్పు జరిగింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈరోజు సాయంత్రం పిఠాపురం చేరుకోవాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన వాయిదా పడింది. రేపు ఉదయం ఆయన మంగళగిరి నుంచి రాజమండ్రికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం వస్తారని జనసేన వర్గాలు వెల్లడించాయి. పర్యటన వాయిదా పడటంతో అధికారులు రేపటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News January 8, 2026
ఇందిరమ్మ ఇండ్లకు రుణ సదుపాయం కల్పించాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పరిస్థితులు లేని లబ్ధిదారులకు రూ.లక్ష సహాయం అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల ఖర్చులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిధుల సమస్య ఏమీలేదని, బిల్లులు అప్లోడ్ చేస్తే మంజూరవుతాయన్నారు.
News January 8, 2026
పాసుపుస్తకాలు పంపిణీ వేగవంతం చేయండి: జేసీ

రైతులకు పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జేసీ రాహుల్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల ఇళ్లకు వెళ్లి నేరుగా పాసుపుస్తకాలు అందజేయాలన్నారు. అదే సమయంలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


