News February 4, 2025
సిద్దిపేట: ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు: హరీశ్ రావు

అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏంటని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు.
Similar News
News March 14, 2025
సిద్దిపేట: మార్చిలోనే మండుతున్న ఎండలు

సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే ఎప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎండలో వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
News March 14, 2025
నాని కేరాఫ్ నయా టాలెంట్

నాని హీరోగా తన మార్కు చాటుతూనే నిర్మాతగా అవతారమెత్తారు. కొత్త వారికి అవకాశమిస్తూ సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంటున్నారు. అ!, హిట్, హిట్-2 సినిమాలే దీనికి ఉదాహరణ. తాజాగా ఆ జాబితాలోకి కోర్టు మూవీ చేరిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ, శైలేశ్ కొలను, తాజాగా కోర్టు సినిమాతో రామ్ జగదీశ్ వంటి దర్శకులను పరిచయం చేశారు. దీంతో నయా టాలెంట్ను ఎంకరేజ్ చేయడంలో నాని ముందుంటారని అంటున్నారు.
News March 14, 2025
రాజమండ్రి: గోదావరి నదిలో దూకి దంపతుల ఆత్మహత్య

రాజమండ్రి వద్ద గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాకినాడ నగరం తూరంగి డ్రైవర్స్ కాలనీకి చెందిన భార్యభర్తలు కాళ్ల వెంకట రమణ, వరలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఘాట్ వద్ద ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టానికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.