News February 11, 2025

సిద్దిపేట ఐటీ టవర్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

సిద్దిపేట ఐటి టవర్‌లో జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న ఫ్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో మరియు ఎఫ్పీఓల సీఈఓ, డైరెక్టర్లతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా క్రిషి కల్ప సీఈఓ సీఎం పాటిల్ ఎఫ్పిఓలు బలోపేతం చేయడానికి చేస్తున్న పనుల గూర్చి కలెక్టర్‌కు వివరించారు.

Similar News

News November 6, 2025

పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్.!

image

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ముందుగా పుంగనూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వినిపించాయి. కాగా పీలేరులో ఏఏ మండాలలు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.

News November 6, 2025

రెండో రోజూ ఏసీబీ సోదాలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేటు వ్యక్తుల పాత్ర ఉందని తెలుస్తోంది. లెక్కల్లో చూపని నగదును పెద్దమొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

News November 6, 2025

ఫూట్ బాల్ రాష్ట్ర స్థాయి విజేత ఉమ్మడి మెదక్

image

వికారాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్- 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి ఫూట్ బాల్ పోటీలో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు ఉమ్మడి పది జిల్లాల నుంచి వచ్చిన జట్లతో పోటీపడి విజేతగా నిలిచింది. విజయం సాధించిన బాలికల జట్టుకు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.