News February 11, 2025
సిద్దిపేట ఐటీ టవర్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట ఐటి టవర్లో జిల్లాలోని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న ఫ్రసిద్ధ, ప్రహర్ష ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న క్రిషి కల్ప అధికారులతో మరియు ఎఫ్పీఓల సీఈఓ, డైరెక్టర్లతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా క్రిషి కల్ప సీఈఓ సీఎం పాటిల్ ఎఫ్పిఓలు బలోపేతం చేయడానికి చేస్తున్న పనుల గూర్చి కలెక్టర్కు వివరించారు.
Similar News
News September 14, 2025
యానిమల్ లవర్స్పై ప్రధాని మోదీ సెటైర్లు

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్పై ప్రధాని మోదీ రీసెంట్గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.
News September 14, 2025
కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.
News September 14, 2025
కొత్తగూడ: చంటి బిడ్డతో ఓ తల్లి నిరసన

కొత్తగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వెజ్, కాంటిజెంట్ కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో ఒక మహిళ తన చంటి బిడ్డతో వర్షంలో గొడుగు పట్టుకుని నిరసన తెలుపుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు కొనసాగుతున్నాయి.