News August 23, 2025
సిద్దిపేట ఐటీ టవర్లో ఫ్రీ కోచింగ్

సిద్దిపేట ఐటీ టవర్(టాస్క్)లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు టాస్క్ ఇన్ఛార్జ్ నరేందర్గౌడ్ తెలిపారు. విద్యార్థులకు Java, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, డేటా బేస్, Sudoku, C, C++, HTML, CSS, Java Scriptతో పాటు ఆప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెల 25, 26న ఐటీ టవర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News August 24, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 24, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.36 గంటలకు
✒ ఇష: రాత్రి 7.50 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News August 24, 2025
ఆ బిల్లుకు PM అతీతం కాకూడదన్నారు: కిరణ్ రిజుజు

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు PM అతీతం కాకూడదని మోదీ చెప్పినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ‘బిల్లు నుంచి ప్రధానికి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని మోదీ క్యాబినెట్కు చెప్పారు. ప్రధాని కూడా ఒక పౌరుడేనని, ఆయనకు ప్రత్యేక రక్షణ అవసరంలేదని చెప్పారు. అత్యధిక సీఎంలు మన పార్టీ వాళ్లే ఉన్నారని, వాళ్లు తప్పు చేస్తే పదవిని వదులుకోవాల్సిందే అని స్పష్టం చేశారు’ అని పేర్కొన్నారు.
News August 24, 2025
ఎస్.రాయవరం: మూడు స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించిన విజయ్

ఎస్.రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన సుంకరణం విజయ్ డీఎస్సీలో సత్తా చాటాడు. స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)లో 94.7 మార్కులు, పీజీటీ (మ్యాథ్స్)లో 78.5 మార్కులు, టీజీటీ (మ్యాథ్స్)లో 87.3 మార్కులు సాధించాడు. ఈ మూడు కేటగిరిల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ బృందం జిల్లా ప్రతినిధి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం విజయ్ను సత్కరించి అభినందించారు.