News January 24, 2025
సిద్దిపేట: కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే హరీశ్రావు ఫైర్.!

కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు ఆపడం సరికాదని హరీశ్రావు పేర్కొన్నారు. పెన్షన్లలో కోతలు విధించడమంటే.. వారి నోటికాడి బుక్కను లాగేసుకోవడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంగనూరు గ్రామ పంచాయతీలో కొడుకు ఇంటి పన్ను కట్టలేదని తల్లి వృద్ధాప్య పెన్షన్లో కోత విధించిన ఘటనపై హరీశ్రావు స్పందించారు.
Similar News
News February 22, 2026
BREAKING.. చింతూరు: హైవేపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

చింతూరు మండలం సింగనగూడెం గ్రామం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2026
కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా?

సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో హామీలిచ్చిన నేతలు అభివృద్ధిలో మమేకం కావాలంటున్నారు.
News February 22, 2026
MDK: ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు: MP

ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని అభిప్రాయ భేదాలు ఉంటే చట్టబద్ధమైన, శాంతియుత మార్గాల్లో వ్యక్తపరచాలని MP రఘునందన్ రావు పేర్కొన్నారు. కామారెడ్డి MLA కాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతిస్తాయని, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


