News March 18, 2025
సిద్దిపేట: కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం: DMHO

కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్ అన్నారు. జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుష్టు రహిత సమాజాన్ని నిర్మించేందుకు జిల్లాలో మార్చి 17 నుంచి 30 వరకు క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించి వైద్యం అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
News March 18, 2025
జగిత్యాల జిల్లాలో 40.4 హయ్యెస్ట్ టెంపరేచర్

జగిత్యాల జిల్లాలో మంగళవారం అత్యధికంగా రాయికల్ మండలం అల్లిపూర్, వెల్గటూర్, బుగ్గారం మండలం సిరికొండ, ఎండపల్లి మండలం మారేడుపల్లి, ధర్మపురి మండలం జైన, సారంగాపూర్ మండలాల్లో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జగిత్యాల, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామంలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూర్ మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 18, 2025
ASF: హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భరోసా

హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు రూ. 2.20 లక్షల చెక్కును అందించారు. బషీరుద్దీన్ ఇస్గాం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుూ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం వారి కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తమకు తెలుపాలని అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు.