News March 23, 2024

సిద్దిపేట: కొడుకూ, కూతురితో బావిలో దూకిన తల్లి

image

MHBD జిల్లాలో శుక్రవారం విషాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. MHBD జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి సిద్దిపేట జిల్లా కక్కెర్లపాడు చెందిన లావణ్యతో పెళ్లి జరిదింది. కుటుంబ కలహాలతో తన కూతురు నిత్య(8), కుమారుడు ముఖేష్(10)లను బావిలో తోసి తానూ దూకింది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా.. బాలుడు ముఖేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భర్త వివాహేతర సంబంధమే మహిళ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

Similar News

News September 7, 2025

మెదక్‌: 24 గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే పునరుద్ధరించినట్లు టీజీఎస్​సీపీడీసీఎల్​ చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి తెలిపారు. మెదక్‌లోని ఎస్ఈ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 26 నుంచి 30 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 115 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన చెప్పారు.

News September 6, 2025

మెదక్: 24 గంటల్లో 110 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ: సీఈ

image

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను 24 గంటల్లోపే 110 గ్రామాలకు పునరుద్ధరించినట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. జిల్లా పరిధిలోని మొత్తం 115 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, అధికారులు వెంటనే స్పందించి ఎస్‌ఈ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.

News September 6, 2025

మెదక్: ఆయిల్ పామ్ సాగు పెంచాలి: యాస్మిన్ బాషా

image

జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.