News January 28, 2025

సిద్దిపేట: గుండెపోటుతో బ్యాంక్ ఉద్యోగి మృతి

image

సిద్దిపేటలోనీ హీడీఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్న సుంకరి రమేష్(38) గుండె పోటుతో మరణించారు. మంగళవారం డ్యూటీలో ఉండగానే ఒక్కసారిగా హార్ట్ ఏటాక్ రావడంతో ఆఫీసులోనే మరణించాడు. మృతుడు రమేష్ ది మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామం. రమేష్‌కి భార్య మాధురి, కొడుకు రిషి వర్ధన్(13), భువన(11) ఉన్నారు.

Similar News

News February 25, 2026

రాజమండ్రి: ఆ పాలు తాగుతున్నారా? అయితే వెంటనే చెకప్ చేయించుకోండి!

image

రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాల వ్యాపారి గణేశ్ ఫోటో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ వ్యక్తి నుంచి పాలు కొనుగోలు చేసిన వారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఆసుపత్రుల్లో ముందస్తు చికిత్స పొందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News February 25, 2026

ఈ పొరపాటు చేస్తే పశువులకు అబార్షన్ అవుతుంది

image

కొన్ని పశువులు గర్భంతో ఉన్నప్పటికీ తీగలు వేస్తుంటాయి. దీనికి కారణం పశువులు గర్భంతో ఉన్నప్పుడు 4 లేదా 5వ నెలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వల్ల తీగలు వేస్తాయి. దీన్నే జస్టేషనల్ హీట్ అంటారు. అందుకే ఎద ఇంజెక్షన్ వేసిన మూడు నెలల తర్వాత పశువులకు చూడి నిర్ధారణ పరీక్ష తప్పకుండా నిర్వహించాలి. ఇది చేయకుండా తీగలు వేసిందని మళ్లీ ఎద ఇంజెక్షన్ వేయిస్తే అబార్షన్ అవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News February 25, 2026

విశాఖ: రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి టోకరా.. రూ.89 లక్షలు దోచేశాడు

image

నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి‌కి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.