News February 22, 2026
సిద్దిపేట: గ్రామం నుంచి ALL INDIA పోటీలకు

రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో జరగనున్నాయి.
Similar News
News February 27, 2026
చిన్నారితో వెకిలి పనులు.. దొంగ బాబాపై పోక్సో కేసు!

ఏడేళ్ల చిన్నారిని అసభ్యంగా తాకుతూ, వెకిలి చేష్టలు చేశాడో దొంగ బాబా. యాద్గిర్(KA) జిల్లాలోని మహల్ రోజా మఠంలో మల్లికార్జున ముత్య(26) బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సుమోటోగా తీసుకొని జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. అయితే ఆమెను కుమార్తెలా చూసుకున్నానని, ఈ కేసుపై చట్టబద్ధంగా పోరాడతానని ముత్య చెప్పాడు.
News February 27, 2026
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా యాదాద్రిని తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. గురువారం ఆలేరు పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్ నిబంధనల అమలుపై సమీక్షించారు. వాహనదారులకు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
News February 27, 2026
రైల్వేస్టేషన్లో స్పృహ కోల్పోయిన వ్యక్తి మృతదేహం ఇంకా మార్చురిలోనే

విశాఖ రైల్వేస్టేషన్లో ఈ నెల23న ప్లాట్ఫారం1 గేట్ నం.3 సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ వ్యక్తిని రైల్వేపోలీసులు గమనించి KGHకి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతి చెందాడు. ఆ మృతదేహం ఇంకా KGH మార్చూరిలో ఉండగా, మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే GRP పోలీసులను సంప్రదించాలని కోరారు.


