News March 13, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 22, 2025
అనకాపల్లి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్

అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. రానున్న 2 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో అనకాపల్లి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం కోసం 08924 88888, 08924 225999, 08924 226599 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. అదేవిధంగా డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.
News October 22, 2025
మేడారం జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి: సబ్యసాచి ఘోష్

మేడారం మహాజాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ మహేశ్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
News October 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ ఇన్స్ట్రక్టర్/ విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్తో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/