News March 13, 2025
సిద్దిపేట: ఘోర రోడ్డ ప్రమాదం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా నర్సంపేట కెనాల్ వద్ద జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. నర్సంపేట గ్రామానికి చెందిన వనం రాజు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు

AP: 2027 గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని దేవాదాయ శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నిర్ణయించారు. జూన్ 26 నుంచి జులై 7 వరకు 6 జిల్లాల్లో ఈ వేడుకలు జరుగుతాయి. సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు సిద్ధం చేయడంతో పాటు 434 ఆలయాలకు మరమ్మతులు చేయనున్నారు.
News February 27, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

*గద్వాల: కలెక్టర్ సంతోష్ బదిలీ
*నూతన కలెక్టర్ గా రిజ్వాన్ భాషా షేక్
*పోలీస్ సేవలు మెరుగుపరచాలి
*భక్తుల ఇంటి వద్దకు భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు
*కేటీ దొడ్డి: గంగన్ పల్లి లో విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
*అయిజ: సీటీపాడులో అగ్ని ప్రమాదం- రూ.50 వేలు గ్రాసం దగ్ధం
*మానవపాడు: బస్సు లేక ఆటోలో పరీక్షలకు విద్యార్థినిలు
*రాజోలి: మురుగుతో అవస్థలు రాత్రి దోమల బెడద
News February 27, 2026
చిన్నారితో వెకిలి పనులు.. దొంగ బాబాపై పోక్సో కేసు!

ఏడేళ్ల చిన్నారిని అసభ్యంగా తాకుతూ, వెకిలి చేష్టలు చేశాడో దొంగ బాబా. యాద్గిర్(KA) జిల్లాలోని మహల్ రోజా మఠంలో మల్లికార్జున ముత్య(26) బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సుమోటోగా తీసుకొని జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. అయితే ఆమెను కుమార్తెలా చూసుకున్నానని, ఈ కేసుపై చట్టబద్ధంగా పోరాడతానని ముత్య చెప్పాడు.


