News September 13, 2025

సిద్దిపేట: చేనుకు చావు.. రైతుకు దుఃఖం

image

జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. ముఖ్యంగా మొక్కజొన్నకు యూరియా చల్లే అదను దాటిపోవడంతో పంట ఎదగక పోవడం కళ్లముందే పంటనాశనం కావడం రైతులను కుంగదీస్తుంది. ఇప్పుడు యూరియా లభించి పోసినా లాభం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం అప్పాయిపల్లికి చెందిన రైతు బాలయ్య, హుస్నాబాద్ మండలం మీర్జాపూర్‌కు చెందిన రైతు శ్రీకాంత్ మొక్కజొన్న పంటలో పశువులను కట్టేసి మేపుతూ ఆవేదన చెందారు.

Similar News

News September 13, 2025

వెల్గటూర్: రోడ్డు ప్రమాదం.. యువకులకు గాయాలు

image

వెల్గటూర్ మండలం కిషనరావుపేట్ గ్రామ బస్టాప్‌కు సమీపంలో రాష్ట్ర రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి కింద పడిన ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్‌‌లో ఆసుపత్రికి తరలించారు.

News September 13, 2025

VKB: రాజీమార్గంతో మేలు: జడ్జి

image

రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకుంటే కక్షలు తగ్గిపోయి సమయం వృథా కాకుండా ఆర్థికంగా చితికి పోకుండా మేలు జరుగుతుందని జిల్లా జడ్జి సున్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించారు. జడ్జి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని కేసులు పరిష్కరించుకొని కక్షిదారులు న్యాయం పొందాలని తెలిపారు.

News September 13, 2025

‘నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా.. నగరాజ ధరుడా శ్రీనారాయణా’ అంటే అర్థమేంటి?

image

అన్నమయ్య రచించిన ఓ ప్రముఖ కీర్తనలోని ఈ పంక్తులకు.. ‘వేదాలు(నిగమ), ఉపనిషత్తుల(నిగమాంత) ద్వారా వర్ణించబడిన అత్యంత మనోహరమైన రూపాన్ని కలిగి ఉన్నవాడా, ఓ శ్రీ నారాయణా! నీవు గొప్ప పర్వతాలు మోసినవాడవు(నగరాజ ధరుడా!)’ అనే అర్థం వస్తుంది. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో గోవర్ధన గిరిని, క్షీరసాగర మథన సమయంలో కూర్మావతారంలో మందర పర్వతాన్ని మోశాడు. అలా నగరాజ ధరుడిగా ఆయణ్ను కొలుస్తారు.