News March 1, 2025
సిద్దిపేట జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

సిద్దిపేట జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు సిద్దిపేటలో 32 నుంచి 33 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 34 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 1, 2025
బాపట్ల జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద గడ్డి బందోబస్తు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసి వేయించామని, మాస్ కాపీ ఎక్కువ అవకాశం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.
News March 1, 2025
అలాగైతే.. TDP వాళ్లంతా జైల్లో ఉండేవారు: అమర్నాథ్

AP: అనుచిత వ్యాఖ్యలు చేశారని పోసానిని అరెస్ట్ చేసినట్లు TDP చెబుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. YCP అధికారంలో ఉన్నప్పుడు TDP వారు తమపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకొని ఉంటే, వాళ్లంతా జైల్లో ఉండేవారని చెప్పారు. కేసులకు భయపడి వైసీపీ నేతలు ఇంట్లో కూర్చునే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు కక్ష సాధింపులపై కాకుండా పరిపాలన మీద, హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
News March 1, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 6,700 రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వారందరూ రేషన్ తెచ్చుకోవచ్చని సివిల్ సప్లై అధికారిని సుగుణ బాయి తెలిపారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను జారీ చేసినట్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారికంగా ప్రకటించింది.