News February 7, 2026

సిద్దిపేట: డేంజర్.. జిల్లాలోకి పెద్దపులి ఎంటర్

image

మూడు రోజులుగా జనగామ జిల్లా ప్రజలను భయాందోళనకు గురి చేసిన పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించిందని డీఎఫ్‌వో లావణ్య వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలంలో సంచరించిన పులి శుక్రవారం అర్ధరాత్రి నర్మెట్ట మండలం మీదుగా సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని తెలిపారు. ఏదేమైనా పులి చిక్కేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News February 13, 2026

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

image

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రం శుక్రవారం భక్తులతో కిక్కిరిసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల యాత్రికులు భారీగా తరలివస్తున్నారు. శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. నేడు స్వామి అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది.

News February 13, 2026

వరంగల్: ఎన్నికల కవరేజీ బిల్లులేవీ సారూ..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ప్రక్రియను ఎన్నికల సంఘం వీడియో కవరేజ్ చేయించింది. నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ తదితరాలను కవరేజ్ చేయించిన అధికారులు వీడియో గ్రాఫర్లకు బిల్లులు ఇవ్వడంలో తాత్సారం వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 317 గ్రామ పంచాయతీల్లో కవరేజ్ చేసిన వీడియో గ్రాఫర్లు బిల్లులు అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 13, 2026

గ్రూప్-1 వివాదం: జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి

image

2018 గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు SIT విచారణకు ఆదేశించింది. జవాబు పత్రాల ట్యాంపరింగ్‌ ఆరోపణపై అదనపు DG నేతృత్వంలో విచారణ జరపాలని పేర్కొంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులను తక్షణమే నాన్-ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అధికారుల జాబితాలో రేపల్లె RDO రామలక్ష్మి ఉన్నారు. కోర్టు ఈ నెల 11న తాజా ఆదేశాలతో ఆమెను ప్రాధాన్యత లేని పోస్ట్‌కు బదిలీ చేయనుంది.