News February 4, 2025

సిద్దిపేట: ‘తల్లీకూతుర్లు మృతి.. ఆదుకోండి’

image

గత నాలుగు రోజుల క్రితం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో భాగంగా పనికి వెళ్లిన కూలీలపై మట్టి బండరాళ్లు విరిగిపడడంతో తల్లి-కూతుర్లు మృతి చెందారు. కొంతమంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి అని హుస్నాబాద్ ఆర్డీఓకు సిద్దిపేట జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) పక్షాన వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 5, 2025

కేంద్రంపై సీఐటీయూ తీవ్ర విమర్శలు

image

కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ అమలు కాకముందే రాష్ట్రంలోని కొన్ని పరిశ్రమలు కార్మికుల నడ్డి విరిచేలా వ్యవహరించడం సిగ్గుచేటని సీఐటీయూ తెలంగాణ ఐదవ మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్ సుక్క రాములు మండిపడ్డారు. మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని, దీంతో కార్మికులకు తీవ్ర నష్టం అన్నారు.

News November 5, 2025

కరాటే పోటీలకు మెదక్ విద్యార్థుల ఎంపిక

image

69వ రాష్ట్రస్థాయి SGF ఆధ్వర్యంలో జరగనున్న పోటీలకు మెదక్ జిల్లా నుంచి పలువురు కరాటే విద్యార్థులు ఎంపికైనట్లు సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ తెలిపారు. అండర్-14 విభాగంలో విశిష్ట రాజ్, సాయిచరణ్, కనిష్కచారి, అర్మన్, అండర్-17లో అఖిల్, అండర్-19లో నిత్య సిరి, ఐశ్వర్య, అబ్దుల్లా ఎంపికయ్యారు. విద్యార్థులను SGF మెదక్ జిల్లా సెక్రెటరీ నాగరాజు, హవేలిఘనపూర్ ఎంఈఓ మధుమోహన్ అభినందించారు.

News November 5, 2025

మెదక్: కస్తూర్బా విద్యాలయంలో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేట మండల కేంద్రంలోని KGBV నిజాంపేటలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ప్రత్యేక అధికారిని రాణి తెలిపారు. వంట మనిషి, సహాయం వంటమనిషి, వాచ్‌మెన్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.