News February 12, 2025

సిద్దిపేట: త్వరలో పెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు

image

కుకునూరుపల్లి హనుమాన్ నగర్‌కి చెందిన గడ్డం గణేశ్(22) మంగళవారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గణేశ్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. కానీ తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గణేశ్ తల్లిదండ్రులకు చెప్పగా వారు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం అర్ధరాత్రి ఫోన్ మాట్లాడివస్తానని ఇంటి బయటకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

Similar News

News February 13, 2025

విజయసాయి రెడ్డి స్థానంలో కన్నబాబు

image

AP: వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో విజయసాయి రెడ్డి ఉండేవారు. అలాగే కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

News February 13, 2025

రాయపోల్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి.. గ్రామస్థుల ఆందోళన

image

రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. వీర నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ జాలిగామ ఐలయ్య ఈరోజు సాయంత్రం సిమెంట్ కోసం అంకిరెడ్డిపల్లి వద్దకు వచ్చి ఆటోను నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నిందితుడిని పట్టుకోవాలని గ్రామస్థులు గజ్వేల్ చేగుంట రహదారిపై ఆందోళన చేపట్టారు.

News February 13, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంశాలు

image

@ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ ఓట్లు అడగాలి: బీజేపీ నేతలు@ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి: మాస్టర్ ట్రైనర్లు @ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు: బ్లాక్ కాంగ్రెస్ @రోడ్డు పనుల్లో అధికారుల జాప్యం @రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ శుభ్రం చేస్తున్న అధికారులు @వేములవాడ రాజన్న సేవలో యూఎస్ఏ భక్తురాలు @CC రోడ్డు డ్రైనేజీ నిర్మాణపనులు ప్రారంభం

error: Content is protected !!