News March 22, 2025
సిద్దిపేట: నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: సీపీ

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట రూరల్ సర్కిల్, దుబ్బాక సర్కిల్ పోలీస్ అధికారులతో పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచించారు.
Similar News
News February 23, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
News February 23, 2026
ఇటు లొంగు‘బాట’.. అటు కర్రెగుట్టల్లో ఆగని వేట

TG: లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతలు TG పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు కర్రెగుట్టల్లో బడే దామోదర్, కేంద్ర కమిటీ సభ్యుడు మిసిర్ బేస్ లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ప్రతి అంగుళాన్ని డ్రోన్ల సాయంతో జల్లెడ పడుతున్నాయి. అటు జెల్ల, తడపాల, డోలి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల రహస్య బంకర్లను కోబ్రా దళాలు ధ్వంసం చేశాయి. మందుపాతరలను బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ నిర్వీర్యం చేశాయి.
News February 23, 2026
ఆదిలాబాద్ గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులు: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 44 ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు పరిష్కార ఆదేశాలు జారీ చేశారు. బాధితుల సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం 8712659973 వాట్సాప్ నంబర్కు పంపవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.


