News February 10, 2025
సిద్దిపేట: ‘నేషనల్ హైవే రోడ్ పనులు వేగంగా పూర్తి చేయాలి’

నేషనల్ హైవే రోడ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి నేషనల్ హైవే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ హైవే ఇంజనీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Similar News
News February 21, 2026
హిందూపురం.. ఇక బాలయ్య స్థావరం!

హిందూపురంలో MLA నందమూరి బాలకృష్ణ సొంతింటి నిర్మాణం చేపట్టారు. పదేళ్లుగా ప్రతిపక్షాలు చేస్తున్న ‘స్థానికత’ విమర్శలకు చెక్ పెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వనం కాలనీలో నివాసంతోపాటు కార్యకర్తల కోసం కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి హ్యాట్రిక్ గెలుపు సాధించిన బాలయ్య ఇకపై తాను నియోజకవర్గంలోనే శాశ్వతంగా ఉంటాననే సంకేతాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఈ నిర్మాణం తలపెట్టినట్లు తెలుస్తోంది.
News February 21, 2026
ఏఐ మాయ.. ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పోతాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలో 30 కోట్ల జాబ్స్ పోతాయని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్మన్ శాక్స్ అంచనావేసింది. కానీ ఆ సంఖ్య 80 కోట్లకు పైనే అని కన్సల్టింగ్ సర్వీసుల కంపెనీ మెక్కిస్నీ చెప్పింది.
News February 21, 2026
T20 WC: సూపర్-8 ఫైట్ జరుగుతుందిలా..

లీగ్ దశ <<19197455>>ముగిసిన<<>> తర్వాత 2 గ్రూపుల్లో నాలుగేసి జట్లున్నాయి. ప్రతి గ్రూపులోని ఒక టీమ్ మిగిలిన మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా ఈ స్టేజీ ముగిసేలోపు 2 గ్రూపుల్లో టాప్-2లో ఉండే 4 జట్లు సెమీస్ చేరుతాయి. భారత్.. SA, జింబాబ్వే, విండీస్తో ఆడనుంది. మరో గ్రూపులో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. సెమీస్లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది. సూపర్-8 షెడ్యూల్ పైన ఇమేజ్లో చూడవచ్చు.


