News March 1, 2025
సిద్దిపేట: పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు:కలెక్టర్

ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. జిల్లాలో 43 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మనూచౌదరి, అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈనెల 21 నుంచి జరిగే టెన్త్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 1, 2025
ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం, లోకేశ్

AP: నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పిల్లలందరూ ధైర్యంగా ఉండాలని, ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని Xలో పోస్ట్ చేశారు. వేసవికాలం కావడంతో డీహైడ్రేట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి లోకేశ్ సూచించారు. ప్రయత్నం సరిగ్గా చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ట్వీట్ చేశారు.
News March 1, 2025
హైదరాబాద్లో రేపటి నుంచి నైట్ఔట్!

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇక మిడ్నైట్ షాపింగ్కు మన చార్మినార్లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
News March 1, 2025
హైదరాబాద్లో రేపటి నుంచి నైట్ఔట్!

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇక మిడ్నైట్ షాపింగ్కు మన చార్మినార్లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.