News May 3, 2024

సిద్దిపేట: పెళ్లిరోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో మృతి

image

జగదేవ్పూర్ మండలం తీగుల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కందుకూరి వెంకటేశం(45) పెళ్లిరోజు మృతి చెందాడు. తీగుల్‌కు చెందిన వెంకటేశం పెళ్లిరోజు కావడంతో భార్య, పిల్లలతో ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అతను పనిచేసే ప్రజ్ఞాపూర్ రెస్టారెంట్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News October 15, 2024

దుబ్బాక: భర్తకు తలకొరివి పెట్టిన భార్య

image

వారిద్దరూ అన్యోన్య దంపతులు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి జీవనం సాగించారు. అయితే విధి వారి బంధాన్ని విడదీసింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధి లచ్చపేటకు చెందిన పూల శంకర్(55), రాధ భార్యాభర్తలు. సోమవారం ప్రమాదవశాత్తు శంకర్ మురికి కాలువలోపడి మృతి చెందాడు. ఆయనకు కొడుకులు లేకపోవడంతో రాధ అంతా తానై భర్తకు అంత్యక్రియలు నిర్వహించింది. తానే భర్తకు తలకొరివి పెట్టింది. ఈఘటన బంధువులను కంటతడి పెట్టించింది.

News October 14, 2024

సంగారెడ్డి: నేడు దామోదర్ రాజనర్సింహ పర్యటన

image

అందోల్ నియోజకవర్గంలోని చౌటకుర్ మండలం తాడ్దన్ పల్లిలోని యంఏస్ ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నేడు ఉ.11 గంటల నుంచి ఆలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

News October 13, 2024

పుల్కల్: సింగూరులో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి

image

పుల్కల్ మండలం సింగూరు నదిలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. సింగూరు గ్రామానికి చెందిన విటల్ (42) శనివారం సాయంత్రం స్నానం కోసం సింగూరు నదిలోకి వెళ్లారు. సింగూరు దిగువ భాగాన స్నానం చేస్తుండగా నదిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.