News October 31, 2025

సిద్దిపేట: పేదింట్లో మెరిసిన ఆణిముత్యం

image

జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన దళిత బిడ్డ తప్పెట్ల సంధ్య హైడ్రో జియాలజిస్ట్‌గా ఎంపికయ్యారు. కూలి కుటుంబానికి చెందిన లక్ష్మి-సత్యనారాయణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్ద కుమార్తె సంధ్య యూపీఎస్సీలో ఫలితాల్లో 29వ ర్యాంక్‌తో ప్రతిభ చాటింది. విద్య పేదరికం, పట్టుదల, కృషి, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించవచ్చని సంధ్య నిరూపించింది. దీంతో ఆమెను గ్రామ ప్రజలు అభినందించారు.

Similar News

News October 31, 2025

అన్నమయ్య జిల్లాలో 14 మంది SIల బదిలీలు

image

అన్నమయ్య జిల్లాలో మొత్తం 14మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు విభాగంలో పరిపాలనా కారణాల రీత్యా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నియామక ప్రాంతాల్లో వీరు తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. బదిలీల జాబితా జిల్లా పోలీసు కార్యాలయానికి చేరడంతో సంబంధిత SIలు కొత్త బాధ్యతల కోసం సిద్ధమవుతున్నారు.

News October 31, 2025

జగిత్యాల: కులదూషణ కేసులో నిందితుడికి జైలు

image

కులం పేరుతో దూషించి హత్యాయత్నం చేసిన కేసులో జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి జాబితాపూర్‌కు చెందిన నిందితుడు బత్తిని సంతోష్‌కు ఏడాది కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ కరీంనగర్ 3వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 26న సంతోష్ సాగర్‌ను కులం పేరుతో దూషించి స్క్రూ డ్రైవర్‌తో దాడిచేశాడు. దర్యాప్తు అనంతరం కోర్టులో నేరం రుజువైనట్లు SP అశోక్‌ కుమార్ తెలిపారు.

News October 31, 2025

రాజమండ్రి ఎంపీపై కేసు నమోదు చేయాలి: జేటీ రామారావు

image

ఏపీలో అణువిద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను ప్రజలు వ్యతిరేకిస్తుంటే అదానీ కోసం రాజమండ్రి ఎంపీ పురంధీశ్వరి అమెరికాతో చీకటి ఒప్పందం చేసుకుంటున్నారని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు గురువారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఆమె పర్యటనపై సమగ్ర విచారణ జరిపి.. ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేయాలన్నారు. శ్రీకాకుళం(D) కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం కోసం USకు చెందిన వెస్టింగ్ హౌజ్ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయన్నారు.