News July 9, 2025

సిద్దిపేట: పోలీస్ కమిషనర్‌ను కలిసిన అడిషనల్ పీపీ

image

సిద్దిపేట అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్ట్ అడిషనల్ పీపీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీహెచ్ కనకయ్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. నూతనంగా అడిషనల్ పీపీగా బాధ్యతలు చేపట్టినందుకు కనకయ్యను సీపీ అభినందించారు. కేసులలో నేరస్థులకు శిక్షలు పడే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కీలకపాత్ర వహించాలని సూచించారు.

Similar News

News July 10, 2025

చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

image

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.

News July 10, 2025

మరో 6 దేశాలకు టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్

image

అధిక సుంకాల విధింపు గడువును US అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటికల్లా ఒప్పందాలు చేసుకోకపోతే అమెరికాకు ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కట్టాలి. రెండ్రోజుల క్రితం 14 దేశాలకు ఈ టారిఫ్స్ వివరాలతో లేఖలు పంపారు. ఇప్పుడు మరో ఆరు దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్స్‌ ప్రకటించారు. ఇరాన్-30%, అల్జీరియా-30%, లిబియా-30%. ఫిలిప్పీన్స్-25%, బ్రూనై-25%, మోల్డోవా-25% చెల్లించాలని తెలిపారు.

News July 10, 2025

రాజధాని రైతులు కోరినట్లే ప్లాట్లు: నారాయణ

image

AP: పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపుపై మంత్రి చర్చించారు. ప్లాట్ల కేటాయింపుపై రైతులు కూడా తమ అభిప్రాయాలను మంత్రి నారాయణకు తెలియజేశారు. రైతులు కోరినట్లే ప్లాట్ల కేటాయింపు ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.