News April 10, 2025
సిద్దిపేట: పోషకాహార లోపం వల్ల ఆరోగ్య సమస్యలు: సీడీపీఓ

పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని సీడీపీఓ శారదా అన్నారు. గురువారం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం పూర్ గ్రామంలోని ఆదర్శ పాఠశాల, కళాశాలలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఆమె మాట్లాడారు. విద్యార్థులు మంచి పోషకాహారం ఉన్న చిరు ధాన్యాలు తినడానికి ప్రయత్నం చేయాలన్నారు.
Similar News
News April 18, 2025
DANGER: రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ధూమపానం వల్ల ఎలాంటి అనర్థాలున్నాయో సిట్టింగ్ వల్ల కూడా అంతే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఎముకలు పెళుసుగా మారతాయి. అలాగే, గుండె జబ్బులు, టైప్-2 డయాబెటీస్తో పాటు కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతారు. వెన్ను నొప్పి, డిస్క్ సమస్యలొస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకే 45 నిమిషాలకొకసారి 10 నిమిషాలు నడిస్తే మంచిది’ అని సూచిస్తున్నారు.
News April 18, 2025
టెక్కలిలో చారిత్రాత్మక కట్టడాలలో కొన్ని ఇవే..

టెక్కలి చరిత్ర తెలిసే విధంగా కొన్ని చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వందల ఏళ్ల క్రితం పూర్వం టెక్కలిలో రాజుల పరిపాలనలో ఉన్న రాజుగారి కోట, కోట భవనాలు, మిస్సమ్మ బంగ్లా, పురాతన ఆలయాలు టెక్కలిలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంతబొమ్మాళి మండలం సీతానగరం వద్ద బ్రిటీష్ కాలం నాటి ముసళ్ల ఖానా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగి ఉంది. ఇక్కడ మండు వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. WORLD HERITAGE DAY
News April 18, 2025
మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంపు?

టెలికాం కంపెనీలు మరోసారి మొబైల్ టారిఫ్స్ పెంచబోతున్నట్లు మనీకంట్రోల్ తెలిపింది. ఈ ఏడాది చివర్లో 10-20% పెంపు ఉండబోతున్నట్లు పేర్కొంది. నవంబర్-డిసెంబర్ నెలల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రీఛార్జ్ ధరల పెంపును ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించింది. ARPU వృద్ధి, మూలధనంపై మెరుగైన రాబడి కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత జులైలోనే టెలికామ్ సంస్థలు టారిఫ్లను పెంచాయి.