News September 23, 2025
సిద్దిపేట: ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యం: CP

యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని సీపీ అనురాధ అన్నారు. మంగళవారం కమీషనర్ కార్యాలయంలో హోంగార్డ్ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సమావేశం నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోమ్ గార్డ్స్ పోలీస్ శాఖలో అంతర్భాగమే అని, వారి సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామని అన్నారు. సివిల్ వివాదాలలో తల దూర్చద్దని సూచించారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు ఉన్నారు.
Similar News
News September 23, 2025
వన్డేల్లో కోహ్లీ ఆడతారా? ఆడరా?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగడంపై అనుమానాలు నెలకొన్నాయి. వచ్చే నెలలో AUSతో వన్డే సిరీస్కు ముందు AUS-Aతో ODI సిరీస్లో ఆడాలని రోహిత్, కోహ్లీకి BCCI సూచించినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రోహిత్ ప్రాక్టీస్ మొదలెట్టగా, BCCIకి కోహ్లీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని సమాచారం. దీంతో ఆయన ఆడటంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం విరాట్ తన ఫ్యామిలీతో లండన్లో ఉంటున్నారు.
News September 23, 2025
పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
News September 23, 2025
అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: డీటీఓ

దసరా పండుగను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 388 ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసి, రూ.33 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి వారం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.