News February 13, 2025
సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739426928105_1243-normal-WIFI.webp)
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News February 13, 2025
సంగారెడ్డి: శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి మరోసారి శిక్షణ: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439150040_52141451-normal-WIFI.webp)
నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సిబ్బంది శిక్షణకు గైర్హాజరైన వారికి మరోసారి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కాగా, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 13, 2025
16న ఢిల్లీ సీఎం ఎంపిక?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439851990_695-normal-WIFI.webp)
UP, MP, రాజస్థాన్ తరహాలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను ఢిల్లీలో అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నెల 16న శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుచేసిన అధిష్ఠానం అదే రోజున సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. రేసులో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మతో పాటు విజయేందర్, ఆశిష్ సూద్, పవన్ శర్మ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 చోట్ల బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
News February 13, 2025
సూర్యాపేట: ఎన్నికల బరిలో 22 మంది!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739440315521_691-normal-WIFI.webp)
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.