News October 22, 2025
సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.
Similar News
News October 22, 2025
కామారెడ్డి: ఇళ్ల నిర్మాణం గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో ఇంటి నిర్మాణ దశలను పరిశీలించి, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక లేదా పరిపాలనా ఇబ్బందులు వెంటనే తెలపాలని, నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News October 22, 2025
చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
News October 22, 2025
నవాబు పేట్: కరెంట్ షాక్తో డ్రైవర్ మృతి

మండలంలోని యన్మన్గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.