News April 25, 2025
సిద్దిపేట: మహిళ ప్రాణం తీసిన పిడుగు

పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన బెజ్జంకిలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఎడ్ల బండి చౌరస్తా సమీపంలోని ఓ చింత చెట్టు సమీప ప్రాంతంలో పిడుగు పడగా దగ్గర ఉన్న టేకు రంగవ్వ (68) మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త శంకరయ్య, కుమారులు, కూతుర్లు ఉన్నారు. అదే ప్రాంతంలో ఉన్న మరో యువకుడు టేకు హరీశ్ స్పృహ తప్పి పడిపోగా చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు.
Similar News
News April 25, 2025
విజయవాడ: రూ.10 కోట్ల భారీ స్కామ్..!

విజయవాడ, నరసరావుపేటలో ఇటీవల వెలుగు చూసిన సినీ యానిమేషన్ స్కామ్లో నగరానికి చెందిన పలువురు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా మోసపోయారు. స్కామ్ నిర్వాహకుడు కిరణ్కు వీరంతా రూ.10 కోట్ల వరకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. అతడు దేశం వదిలి పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
News April 25, 2025
ఉగ్రదాడి: భారతీయులకు క్షమాపణలు చెప్పిన నటి

పహల్గామ్ ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా భారతీయులందరికీ క్షమాపణలు తెలియజేశారు. మతం చూసి దాడికి పాల్పడటం హీనమైన చర్య అని ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. ఈ ఘటన తనపై మానసికంగా ప్రభావం చూపించిందని తెలిపారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా కలిసికట్టుగా పోరాడుదామని పేర్కొన్నారు. భారతీయురాలిగా దేశం తరఫున నిలబడతానని చెప్పారు.
News April 25, 2025
పాక్ అథ్లెట్కి ఆహ్వానం.. స్పందించిన నీరజ్ చోప్రా

పాక్ ఆటగాడు అర్షద్ను NC క్లాసిక్ ఈవెంట్కు ఆహ్వానించడంపై భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. ‘అర్షద్కు ఆ ఆహ్వానం ఉగ్రదాడులకు ముందు పంపించా. ఆ ఘటన తర్వాత అతడిని పిలిచే ప్రసక్తే లేదు. నాకు నా దేశమే ముఖ్యం. నన్ను, నా కుటుంబాన్ని అకారణంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఏడాది క్రితం నా తల్లిని కొనియాడిన అదే నోళ్లు నేడు ఆమెను దారుణంగా తిడుతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.