News February 20, 2025

సిద్దిపేట: మానవత్వాన్ని చాటిన కానిస్టేబుల్

image

అత్యవసర సమయంలో ఒకరికి రక్త దానం చేసి మానవత్వాన్ని ఓ కానిస్టేబుల్ చాటాడు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఆపరేషన్ సమయంలో ” O ” పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ శేఖర్ వెంటనే మిత్ర బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 9, 2025

వికారాబాద్ బీజేపీ అధ్యక్ష పదవి జాప్యంపై ఉత్కంఠ

image

డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండడంపై పార్టీలో చర్చ నడుస్తోంది. ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినా, అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యానికి కారణం ఏంటన్న దానిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మద్దతు ఎవరికి ఉంటుందనే అంశంపై జిల్లా రాజకీయాల్లో భారీగా ఉత్కంఠ నెలకొంది.

News November 9, 2025

అన్నమయ్య: నూతన కమిటీ నియామకం

image

అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్.శ్రీలక్ష్మి, పి.రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా యం.గౌరి నియమితులయ్యారు. ఆ సంఘం 2వ జిల్లా మహాసభ మదనపల్లె ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది. 13 మంది ఆఫీస్ బేరర్లు, 33మందితో జిల్లా కమిటీ ఏర్పరిచారు.

News November 9, 2025

భద్రాద్రి: ఏ క్యాహై.. ఎమ్మెల్యే సాబ్ జర దేఖో..!

image

చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో మృతి చెందిన వారి అంతిమయాత్రలో బంధువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కబరస్థాన్ (శ్మశానవాటిక)కు వెళ్లే రోడ్డు మార్గం లోతైన గుంతలతో, బురదమయంగా మారింది. దీంతో గ్రామస్థులు మృతదేహాన్ని భుజాలపై కాకుండా, చేతులపై మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందించి, రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.