News December 15, 2025
సిద్దిపేట: మూడవ విడతలో 3841 మంది పోలింగ్ సిబ్బంది

సిద్దిపేట జిల్లాలో జరుగనున్న మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో 3841 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం నిర్వహించారు. మొత్తం 3841 మంది సిబ్బంది పనిచేయనున్నారని, ఇందులో 1718 పీఓలు, 2123 అదనపు పీఓలను నియమించినట్లు తెలిపారు.
Similar News
News December 17, 2025
SRD: పోలింగ్ సరళి పరిశీలిస్తున్న ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలోని 8 మండలాల్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. పోలింగ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తునట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు, రూట్ మొబైల్ బృందాల కదలికలను పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నామన్నారు.
News December 17, 2025
పంచాయతీ పోరు: పాన్గల్లో జోరు.. వీపనగండ్లలో నెమ్మది

వనపర్తి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా పాన్గల్ మండలంలో 56.7 శాతం పోలింగ్ నమోదు కాగా, వీపనగండ్లలో అత్యల్పంగా 52.4 శాతం నమోదైంది. పెబ్బేరు(55.6%), శ్రీరంగాపూర్(54.9%), చిన్నంబావి(54%)ల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐదు మండలాల్లోనూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్లు.. లోకేశ్ సత్కారం

మహిళా ప్రపంచకప్లో సత్తాచాటిన కడప క్రికెటర్ శ్రీచరణికి కూటమి ప్రభుత్వం భారీ నజరానా అందించింది. బుధవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఆమెకు రూ.2.5 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీచరణి ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొనియాడారు.


