News March 20, 2024

సిద్దిపేట: ‘మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందాం’

image

మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మెదక్ BJP అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ సీటును భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులతో పాటు ఆయా మోర్చాల నాయకులు, శక్తి కమిటీలు, బూత్ కమిటీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News July 3, 2024

కంగ్టి: బ్రెయిన్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి

image

బ్రెయిన్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన కోటగిరి రాజు(35) కొద్ది రోజులుగా తలలో నొప్పితో బాధపడుతూ సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేశారని, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News July 3, 2024

MDK: నేటితో ముగియనున్న పదవీ కాలం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జులై 3న మండల పరిషత్, 4న జిల్లా పరిషత్‌కు పాలకవర్గాలు కొలువుదీరాయి. 5ఏళ్ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. మెదక్ జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

News July 3, 2024

సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం

image

అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.