News March 18, 2025
సిద్దిపేట: యువకుడి ఆత్మహత్య

కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెజ్జంకి మండలంలో జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి వివరాలు.. మండలంలోని నరసింహులపల్లికి చెందిన కుసుంబ సాయి (22) కడుపునొప్పి భరించలేక సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసున్నాడు. మృతుని తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News July 9, 2025
రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.
News July 9, 2025
మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.
News July 9, 2025
ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.