News December 12, 2025
సిద్దిపేట: రెండవ విడతలో 4409 మంది సిబ్బంది నియామకం

జీపీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మీరుదొడ్డి, నంగునూరు, నారాయణపేట, సిద్దిపేట రూరల్, అర్బన్లో 4409 మంది సిబ్బంది పనిచేయనున్నట్లు తెలిపారు.
Similar News
News December 15, 2025
‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
News December 15, 2025
NZB: రాత్రి వరకు కొనసాగిన GP ఎన్నికల కౌంటింగ్

నిజామాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో ఆదివారం జరిగిన GP ఎన్నికల కౌంటింగ్ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో రాత్రి వరకు కొనసాగింది. చిన్న GPల్లో సాయంత్రం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాగా 158 సర్పంచ్ స్థానాలకు 568 మంది, 1,081 వార్డులకు 2,634 మంది పోటీలో నిలవగా మొత్తం 2,38,838 మంది ఓటర్లకు గాను 1,83,219 మంది (76.71 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 15, 2025
మంత్రి తుమ్మల ఇలాకాలో.. ఎవరు గెలిచారంటే..!

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వగ్రామమైన దమ్మపేట మండలం గండుగులపల్లి సర్పంచ్ ఫలితాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెచ్చు ఈదప్ప తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై 350 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో సొంత గ్రామంలో తుమ్మల, జారే తమ పట్టు నిలుపుకున్నారు.


