News February 8, 2025
సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738925710185_52021735-normal-WIFI.webp)
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
Similar News
News February 8, 2025
ఉదయం లేవగానే రీల్స్ చూస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738910051206_746-normal-WIFI.webp)
ఉదయం లేవగానే మొబైల్ పట్టుకుని రీల్స్ చూస్తే కార్టిసాల్ హార్మోన్ పీక్స్కి వెళ్లిపోయి రోజంతా స్ట్రెస్ ఫీలవుతారని డాక్టర్లు చెబుతున్నారు. దానికి బదులు సూర్యరశ్మి పడే ప్రదేశంలో కాసేపు నిల్చొని డే స్టార్ట్ చేస్తే చికాకు, స్ట్రెస్ దూరమవుతుందని అంటున్నారు. సాయంత్రం కూడా ఆఫీస్ నుంచి రాగానే టీవీలో గొడవలు పడే న్యూస్ చూసేబదులు పిల్లలు, కుటుంబంతో సరదాగా మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని సూచిస్తున్నారు.
News February 8, 2025
మెదక్: పక్కడ్బందీగా ప్రత్యేక తరగతులు: డీఈవో
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738947899709_50061539-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని డీఈవో రాధా కిషన్ ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 8, 2025
KMR: అంతర్జాతీయ ప్రశంసా పత్రం అందుకున్న వైద్యాధికారిణి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738937003617_50226745-normal-WIFI.webp)
భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిన 8 అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్లో కాలేయ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ స్టడీ పైన ప్రొఫెసర్ డాక్టర్ అస్మిత వేలే డైరెక్టర్ రిసెర్చ్ డీపీయూ పూణే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ చైతన్య రమావత్ అందుకున్నారు. కాలేయ వ్యాధులకు సంబంధించి పరిశోధన చేయడం తనకు ఆనందంగా ఉందని చైతన్య రమావత్ తెలిపారు.