News March 13, 2026

సిద్దిపేట: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.

Similar News

News April 13, 2026

అన్నదాతకు ‘ఉల్లి’పోటు.. భారీగా పడిపోయిన ధర

image

TG: ఉల్లి ధరలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. సంగారెడ్డి(D) సదాశివపేట మార్కెట్‌లో గతేడాది APRలో రూ.2,300 పలికిన క్వింటాల్ ఉల్లి తాజాగా రూ.504కు పడిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. JAN-MAY మధ్య భారీగా దిగుబడి వస్తుంది. దీంతో ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో వ్యాపారులు రూ.100కు 5-8 కిలోల వరకు ఉల్లి విక్రయిస్తున్నారు.

News April 13, 2026

భూపాలపల్లి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

ఇంటర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 34 కళాశాలల్లోని ఫస్ట్ ఇయర్‌లో 1734 విద్యార్థులకు 1259 మంది, సెకండ్ ఇయర్‌లో 1740 మందికి 1439 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో గతేడాది 56% రాగా ఈ ఏడాది 73.03 % , సెకండ్ ఇయర్‌లో గత ఏడాది 72.07 శాతం, ఈఏడాది 82.34% మంది విద్యార్థులు పాసయ్యారు.

News April 13, 2026

KMR: ఎక్కడ లోపం జరిగింది.. ఇంటర్ ఫలితాలపై ఆరా..!

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా అట్టడుగు స్థానాలకు పడిపోవడంపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫస్ట్ ఇయర్ 49.40% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి, సెకండియర్ లో 63.09% ఫలితాలతో 32వ ర్యాంకుకు జిల్లా పరిమితమైంది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో ఇబ్బందులా… వసతుల్లేవా అనే కారణాలు తెలుసుకుంటున్నారు.