News October 31, 2025
సిద్దిపేట: వాగులో దంపతుల మృతదేహాలు లభ్యం

అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వాగులో వరద ప్రవాహానికి HNK జిల్లా భీమదేవరపల్లికి చెందిన <<18150389>>దంపతులు<<>> ఈసంపల్లి ప్రణయ్(28), కల్పన(24) గల్లంతైన విషయంతెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఇవాళ ఉదయం ప్రణయ్, కల్పన మృతదేహాలను గుర్తించారు. కాగా మృతదేహాలను పట్టుకొని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News October 31, 2025
ప.గో: డెడ్ బాడీ పార్సిల్ కేసులో రాష్ట్రానికి 4 అవార్డులు

ఉండి (M) యండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు చేధనలో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ నయీమ్ అస్మితో పాటు మరో ముగ్గురు అధికారులు అవార్డులు అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్లో అవార్డులు ప్రకటించారు. అవార్డులు అందుకున్న నలుగురు అధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు.
News October 31, 2025
భారత్లో టెస్లా, స్టార్లింక్ నియామకాలు

ఎలాన్ మస్క్కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్లింక్’ భారత్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్లింక్ పేర్కొంది.
News October 31, 2025
భాగస్వామ్య సదస్సు విజయవంతంపై కలెక్టర్ సమీక్ష

విశాఖలో ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. AU ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే ఈ సదస్సును అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని విజయవంతం చేయాలని ఆదేశించారు. నగర సుందరీకరణ, అతిథుల వసతి, భద్రత, రాకపోకలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


