News February 24, 2025
సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న ఛత్తీస్గఢ్కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్ను ఢీకొట్టడంతో మరణించాడు.
Similar News
News February 20, 2026
ధర్మారం: SRSP కాల్వ వంతెనపై యాక్సిడెంట్

ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ వంతెనపై ఓ ఆటో బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగలడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి(36), బైక్పై ఉన్న గజ్జెల సురేశ్(35) తీవ్రంగా గాయపడగా, పోలీసులు వారిని చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 20, 2026
యంగ్ హీరోతో అనుపమ డేటింగ్?

అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్లో వీరిద్దరూ సెల్ఫీ తీసుకోగా దాన్ని ధ్రువ్ ఇన్స్టాలో షేర్ చేశారు. అనుపమ ఆ పోస్ట్ను రీషేర్ చేస్తూ లవ్ సింబల్ జోడించారు. అంతకుముందు ఓ వేడుకలోనూ రాత్రి 2 గంటలకు ఫోన్ చేయాల్సి వస్తే ఇండస్ట్రీలో ఎవరికి చేస్తారని అడగగా ధ్రువ్కి చేస్తా అని అనుపమ చెప్పారు. వీరిద్దరూ గతేడాది ‘బైసన్’ సినిమాలో నటించారు.
News February 20, 2026
చీనీ ధరలు పెంపు.. రైతుల సంతోషం

అనంతపురం వ్యవసాయ మార్కెట్లో చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. మార్కెట్కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా.. నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 ధర లభించినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


