News February 24, 2025

సిద్దిపేట: వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

వేర్వేరు ప్రమాదాల్లో డివైడర్‌ను ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. చిన్నకోడూర్ మండలం మల్లారం గ్రామ శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో బైక్‌పై ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రానికి చెందిన ఉలేష్ కుమార్ (40) విష్ణు ఠాకూర్ (42) అక్కడికక్కడే మృతి చెందారు. కొండపాక మండలానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి(22) మండలంలోని సిర్సనగండ్ల శివారులో డివైడర్‌ను ఢీకొట్టడంతో మరణించాడు.

Similar News

News February 24, 2025

మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: అచ్చెన్న 

image

ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు సోమవారం చరవాణిలో మాట్లాడారు. దర్శనానికి వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News February 24, 2025

ప్రియుడి కోసం విషం తాగిన యువతులు

image

AP: విషం తాగి బతికినవాళ్లు ప్రియుడితో ఉండాలని ఇద్దరు అమ్మాయిలు పోటీపడిన ఘటన అనంత(D)లో జరిగింది. దివాకర్, రేష్మ, శారద ఒకే కాలేజీలో చదివారు. దివాకర్‌ను లవ్ చేసిన రేష్మకు మరొకరితో పెళ్లైంది. ఆ తర్వాత శారదను దివాకర్ లవ్ చేశాడు. ఇటీవల రేష్మ భర్తను వదిలేసి ప్రియుడి వద్దకొచ్చింది. రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో మాటల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ప్రస్తుతం శారద చనిపోగా, రేష్మ ఆస్పత్రిలో ఉంది.

News February 24, 2025

సౌరశక్తిలో భారత్ సూపర్ పవర్: ప్రధాని మోదీ

image

ఆర్థిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా IND కొనసాగుతోందని వరల్డ్ బ్యాంక్ కొనియాడిందని PM మోదీ వెల్లడించారు. సౌరశక్తిలోనూ ఇండియా సూపర్ పవర్‌గా మారిందని UN ప్రశంసించిందన్నారు. MPలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో PM ప్రసంగించారు. ఇతర దేశాలు మాటలకే పరిమితమైతే భారత్ చేసి చూపిందని చెప్పారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తే ఎకానమీ గ్రోత్, ఉద్యోగాల కల్పనకు దారి ఏర్పడుతుందన్నారు.

error: Content is protected !!