News March 1, 2025
సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.
Similar News
News October 30, 2025
పత్తిలో 20% తేమ ఉన్నా కొనండి.. CCIకి లేఖ

TG: భారీ వర్షాల నేపథ్యంలో పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని CCIకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ మల్లు రవి లేఖ రాశారు. తేమ పెరగడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రబీ సీజన్ కోసం నెలకు 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కాగా క్షేత్రస్థాయిలో పత్తిలో 12% తేమ దాటితే <<18118478>>మద్దతు ధర<<>> దక్కడం లేదు.
News October 30, 2025
అమరావతి ప్లాట్ల రిజిస్ట్రేషన్ వేగం పెంచనున్న ప్రభుత్వం

రాజధాని ప్రాంతంలో ప్లాట్ల కేటాయింపుపై జరుగుతున్న అపోహలను మంత్రి నారాయణ ఖండించారు. బుధవారం ఆయన తెలిపిన ప్రకారం.. ఇప్పటి వరకు 29,644 మంది రైతులకు 34,192 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించగా, 60,380 ప్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఇంకా 2,501 మంది రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందన్నారు. వివాదాస్పద భూములు, కోర్టు కేసులు పూర్తయ్యాక 4 నెలల్లో మొత్తం ప్రక్రియ ముగిస్తామని చెప్పారు.
News October 30, 2025
HYD: నేడు మెగా జాబ్ మేళా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. HYD సిటీ పోలీస్ సౌత్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో OCT 30న గుడిమల్కాపూర్ రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. ఉద్యోగాలు పొందేందుకు 10వ తరగతి పాస్, ఫెయిల్ అయినవారి నుంచి డిగ్రీ హోల్డర్స్ వరకు అందరూ అర్హులే. ఐటీ, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, ఫార్మసీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు 87126 61501ను సంప్రదించండి.
SHARE IT


