News March 1, 2025

సిద్దిపేట: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

సిద్దిపేటలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. వర్గల్ మం. గౌరారం వద్ద <<15609808>>రాజీవ్ రహదారిపై<<>> ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో మేడ్చల్‌కు చెందిన వ్యాపారి శ్యాంబహదూర్ సింగ్(41) చనిపోగా.. డ్రైవర్ చందు, సాయి కుమార్ గాయాలతో బయటపడ్డారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపాక మండలం మర్పడగకు చెందిన పెయింటర్ <<15605788>>భిక్షపతి<<>> సైకిల్ పైనుంచి కిందపడి మృతిచెందాడు.

Similar News

News March 1, 2025

మీ జీతం కూడా ఇండియా వల్లే: సునీల్ గవాస్కర్

image

దుబాయ్‌లో ఆడటం భారత్‌కు కలిసివచ్చిందన్న ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలను సునీల్ గవస్కర్ తిప్పికొట్టారు. ఓటమి అక్కసు తమ టీమ్‌పై చూపకూడదన్నారు. భద్రతాలోపాలతోనే దుబాయ్‌లో ఆడుతున్నట్లు బీసీసీఐ ముందే ప్రకటించిందన్నారు. ఐసీసీకి భారత్ ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోందని, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. వారికొచ్చే జీతం కూడా పరోక్షంగా(నాజర్ హుస్సేన్, మైక్ అథర్టన్) భారత్ ద్వారానే అందుతుందన్నారు.

News March 1, 2025

ఆశా వర్కర్లకు CM గుడ్ న్యూస్

image

ఏపీలోని 42వేల మంది ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేశారు. రిటైర్మెంట్ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచారు. అందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం వారికి నెలకు రూ.10వేల జీతం వస్తోంది. సర్వీస్ ముగింపులో గ్రాట్యుటీ కింద రూ.1.50 లక్షలు పొందే అవకాశం ఉంది. వీటిపై త్వరలో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

News March 1, 2025

వికారాబాద్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

image

వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. మార్చి నుంచే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు తెలిపారు. గతంలో 2,41,169 రేషన్ కార్డులు ఉన్నాయి. నూతనంగా మరో 22,404 మంజూరు అయ్యాయి. దీంతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,63,573కు చేరింది. SHARE IT

error: Content is protected !!