News March 27, 2025
సిద్దిపేట: ‘సెర్ఫ్ లక్ష్యాలను చేరుకోవాలి’

సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
Similar News
News March 30, 2025
రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఆళ్లగడ్డ

నంద్యాల జిల్లాలో కొద్దిరోజులుగా భానుడు భగభగ మండుతున్నాడు. ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం.. ఆదివారం 41.5°C ఉష్ణోగ్రతతో ఆళ్లగడ్డ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 30, 2025
ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ఏలూరులో జిల్లా జైలులో మహిళ ముద్దాయి అనుమానాస్పదస్థితిలో మృతి* ఏలూరు గిరిజన భవన్ లో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న కలెక్టర్*పెట్రోల్ పోసి వృద్ధురాలిని హతమార్చిన కేసులో వ్యక్తి అరెస్ట్*పాస్టర్ ప్రవీణ్ మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని జీలుగుమిల్లిలో ర్యాలీ*కొయ్యలగూడెం మండలం సీతంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
News March 30, 2025
రంజాన్ లౌకికవాదానికి ప్రతీక: సీఎం రేవంత్

TG: ముస్లింలకు సీఎం రేవంత్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దానధర్మాలు మానవాళికి ఆదర్శం. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుంది’ అని తెలిపారు.