News March 27, 2025
సిద్దిపేట: ‘సెర్ఫ్ లక్ష్యాలను చేరుకోవాలి’

సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ అన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి. దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ పోలింగ్.. ప్రముఖులు ఓట్లు వేసేది ఎక్కడంటే?

TG: జూబ్లీ ఉపఎన్నికకు ఇవాళ పోలింగ్ జరగనుంది. షేక్పేట్లో డైరెక్టర్ SS రాజమౌళి, కమెడియన్ అలీ, మధురానగర్లో యాంకర్ సుమ సహా పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ఓటు వేయనున్నారు. సినీ కార్మికుల ఓట్లు అధికంగా ఉండటంతో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్స్ రద్దు చేసి, వారికి సెలవు ఇచ్చింది. చిరంజీవి, చెర్రీ, బన్నీ నివాసాలు జూబ్లీ పరిధిలోనే ఉన్నా.. వారి నియోజకవర్గం మాత్రం ఖైరతాబాద్ కిందికి వస్తాయి. దీంతో వారు ఓటు వేయలేరు.
News November 11, 2025
పెదబయలు: అదృశ్యమైన విద్యార్థినీల ఆచూకీ లభ్యం

అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినీలు ఆచూకీ లభ్యమైనట్లు DSP సహబజ్ అహ్మద్, MEO పుష్ప జోసెఫ్ తెలిపారు. పెదబయలులోని గర్ల్స్-1లో చదువుతున్న వసంత, తేజ చదువుకు భయపడి పాఠశాల యాజమాన్యం కల్లుగప్పి ఈనెల 6న స్వగ్రామమైన కించురుకు బయలుదేరి వెళ్లారు. ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని ఊరు చివర ఉన్న కొండపై దాక్కున్నారని చెప్పారు. వారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. CI శ్రీనివాసరావు, SI రమణ పాల్గొన్నారు.
News November 11, 2025
ఆరుద్రలో అడ్డెడు చల్లినా పుట్టెడు పంట

ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 5 వరకు ఉండే సమయం) అనేది వర్షాకాలం ప్రారంభంలో వ్యవసాయ పనులకు సరైన సమయం. ఈ కార్తెలో భూమిలో తగినంత తేమ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అడ్డెడు( తక్కువ పరిమాణంలో) విత్తనాలు చల్లినా, అవి బాగా మొలకెత్తి పుట్టెడు(ఎక్కువ) పంటను ఇస్తాయని రైతుల విశ్వాసం. ఈ సామెత ఆరుద్ర కార్తెలో విత్తనాలు వేయడం, అప్పటి వర్షాలు.. పంటకు ఎంత అనుకూలంగా ఉంటాయో తెలియజేస్తుంది.


