News October 29, 2025
సిద్దిపేట: హరీశ్రావుని పరామర్శించిన ఏపీ మాజీ మంత్రి

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడుదల రజిని మంగళవారం హరీశ్రావు నివాసానికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోపాటు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కూడా X వేదికగా సంతాపం తెలిపారు.
Similar News
News October 29, 2025
HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?
News October 29, 2025
‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.
News October 29, 2025
వనపర్తి: మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలి- కలెక్టర్

మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతి మండలం నుండి స్వయం సహాయక సభ్యులకు కనీసం ఒక యూనిట్ నెలకొల్పే విధంగా ఏ.పీ.యం.లు బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. అలాగే జిల్లాలోని జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్లు కట్టుకోవడానికి మహిళా సంఘాల ద్వారా రుణాలు మంజూరు చేయించాలన్నారు. ఎక్కడైనా బ్యాంకర్లతో సమస్యలు ఉంటే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.


