News March 18, 2025

సిద్దిపేట: ‘25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలి’

image

LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం LRS రుసుముపై 25% తగ్గింపు రాయితీ ప్రకటించినట్లు తెలిపారు. కావున 2020 సంవత్సరంలో LRS కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు ఈ నెల 31లోగా పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు.

Similar News

News November 3, 2025

ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామనడం సరికాదు: ఒవైసీ

image

బిహార్ ఎన్నికల్లో ‘ఇండీ’ కూటమి ఓట్లు చీల్చేందుకే పోటీ చేస్తున్నామన్న విమర్శలను MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ‘2020లో 5 సీట్లు గెలిచాం. పోటీచేసిన మిగతా 14లో 9 MGB గెలిచింది. 2024లో కిషన్‌గంజ్ MP సీటులో 2 లక్షలకుపైగా ఓట్లు సాధించాం. మేం ఆ ఒక్క సీట్లో పోటీచేసినా BJP అనేక చోట్ల గెలిచింది’ అని తెలిపారు. గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేయడానికే తమ పోటీ అన్నారు. ఈసారి MIM 24చోట్ల పోటీ చేస్తుంది.

News November 3, 2025

మైక్రో చీటింగ్‌తో కాపురాల్లో చిచ్చు

image

భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్‌’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. ఇందులో చాలామందికి చెడు ఉద్దేశాలూ ఉండవని అంటున్నారు నిపుణులు. కానీ చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతిని దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.

News November 3, 2025

SRCL: పెద్దింటి అశోక్‌ కుమార్‌కు జీవన సాఫల్య పురస్కారం

image

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సినీ గేయ రచయిత అయిన పెద్దింటి అశోక్‌ కుమార్‌కు ‘అమృత లత జీవన సాఫల్య పురస్కారం-2025’ లభించింది. నిజామాబాద్‌లోని అపురూప అవార్డు బృందం వారు ఆదివారం ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సాహిత్యంపై ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీల నుంచి ఐదు ఎంఫిల్, నాలుగు పీహెచ్‌డీ పట్టాలు రావడం విశేషం.