News September 10, 2025

సిద్దిపేట: ‘40 వేల మె.ట యూరియాకు.. 28 వేలే’

image

సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 4.87 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగులోకి వచ్చాయి. 40 వేల మె.ట యూరియా అవసరముండగా 28,882 మెట్రిక్ టన్నులే వచ్చింది. 20 రోజుల కిందటే వరికి యూరియా చల్లాల్సి ఉన్నా అన్నదాతలకు సరిపడే యూరియా దొరక్కపోవడంతో ఇంతవరకు చల్లలేదు. దీంతో పంట ఎదుగుదల లేక పిలకలు పెట్టక అలాగే అగిపోయింది. యూరియా కోసం రైతులు లైన్లో నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఉంది.

Similar News

News September 10, 2025

తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన పూర్వపు ఈవో

image

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును బదిలీపై వెళ్తున్న పూర్వపు ఈవో శ్యామలరావు బుధవారం ఛైర్మన్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోగా పదవీకాలంలో తనకు అన్ని విధాల సహకరించిన బిఆర్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ శ్యామల రావును శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. తర్వాత కాసేపు ముచ్చటించారు.

News September 10, 2025

రామరాజ్యం లాంటి పాలన ఇస్తాం: CM

image

AP: రాష్ట్ర ప్రజలకు రామరాజ్యం లాంటి పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘నేను, పవన్ కళ్యాణ్, మాధవ్ కలిసి సుపరిపాలన అందిస్తాం. నేను నాలుగో సారి సీఎంను. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్. ఎమ్మెల్యేలందరూ కామన్ మ్యాన్‌లాగే ఉండాలి. దర్జాలు, ఆర్భాటాలు పనికిరావు. ఎవరూ అహంకారాన్ని ప్రదర్శించవద్దు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే పనులు వేగంగా అవుతున్నాయి’ అని అనంతపురంలో వివరించారు.

News September 10, 2025

ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే

image

నెల రోజుల్లోగా ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఓదెల ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిధిలో 500 మీటర్లలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిషేధమని పేర్కొన్నారు. ఆలయ పాలకమండలితో ఆలయ అభివృద్ధిపై చర్చించారు. అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.