News February 18, 2026
సిద్దిపేట: 51 ఏళ్ల తర్వాత.. గురువులకు సన్మానం

గురుశిష్యుల బంధానికి ఈ ఘటన ఒక నిదర్శనం. 51 ఏళ్ల క్రితం తమకు పాఠాలు బోధించిన లెక్చరర్లను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఏడు పదుల వయసు దాటిన మాజీ విద్యార్థులంతా కలిసి ఐఐటీ రామయ్య(Maths), మధుసూదన్(Physics), నాగేశ్వర్ రావు(Chemistry)లను ఆత్మీయంగా సత్కరించారు. సిద్దిపేటకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వినూత్న వేడుకలో పాల్గొని తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Similar News
News February 21, 2026
నల్గొండ: హత్యాయత్నం.. తండ్రీకూతుళ్లకు రిమాండ్

భూ తగాదా నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రీకూతుళ్లకు NLG కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. NKP(M) అమ్మనబోలుకి చెందిన జెర్రిపోతుల రమేష్, బాసాని శివ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నెల 19న వివాదాస్పద స్థలంలో రమేష్ తన భార్య సమాధి నిర్మిస్తుండగా, శివ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రమేశ్, అతని కుమార్తె నేహ కలిసి శివపై కత్తితో దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
News February 21, 2026
పిల్లలకు నెబులైజర్ వాడుతున్నారా?

వాతావరణం మారినపుడు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినపుడు పిల్లల ఊపిరితిత్తుల్లో తెమడ చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు మాత్రం నెబ్యులైజర్ వాడాలి. కానీ కొంతమంది ముక్కు దిబ్బడ, జలుబు వేగంగా తగ్గుతాయని సొంతంగానే నెబ్యులైజర్ వాడుతుంటారు. కానీ అది సరికాదు. డాక్టర్ సలహా మేరకే నెబ్యులైజర్ని ఉపయోగించాలి. ఒకవేళ పిల్లలకు అలర్జీ సమస్య ఉంటే అత్యవసర సమయంలో నెబ్యులైజర్ వాడచ్చు.
News February 21, 2026
NZB: విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పు

జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 3 రోజుల్లో సెక్షన్ల మార్పునకు అధికారులు రంగం సిద్ధం చేశారు.


