News July 6, 2024
సిద్దిపేట: RTC బస్సు ఢీకొని HM మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చేర్యాలలో జరిగింది. SI దామోదర్, స్థానికుల వివరాల ప్రకారం.. సిద్దిపేట వాసి K.చంద్రశేఖర్(59) DNT స్కూల్లో గెజిటెడ్ HMగా పని చేస్తున్నారు. శుక్రవారం బైక్పై పాఠశాలకు బయలుదేరిన ఆయనను చేర్యాల వద్ద వెనుకనుంచి వస్తున్న RTC బస్సు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన చంద్రశేఖర్ను HYD తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News February 1, 2026
MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News February 1, 2026
మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.
News February 1, 2026
మెదక్: ఆపరేషన్ స్మైల్.. 81 మంది SAFE

జిల్లాలో జనవరి 1 నుంచి ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. మెదక్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 81 మంది బాలలను రక్షించి, 69 మందిని తల్లిదండ్రులకు అప్పగించి, 12 మందిని సంరక్షణ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. 6 పాఠశాలలో ప్రవేశం కల్పించడం అభినందనీయమన్నారు.


