News March 18, 2025

సిద్ధార్థ్‌ను అభినందించిన సీఎం

image

అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్‌ను రూపొందించిన సిద్ధార్థ్‌ను సీఎం అభినందించారు. అరగంట పాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని బాలుడిని సీఎం ప్రోత్సహించారు. కాగా సిద్ధార్థ్ రూపొందించిన యాప్‌ 7 సెకన్లలోనే గుండె పనితీరు చెప్పేస్తుంది.

Similar News

News March 18, 2025

ఏలూరు జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఏలూరు జిల్లాలో ముగిసిన ఇంటర్ థియరీ పరీక్షలు
*శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
* పెదపాడు: MEO- టీచర్‌ను మందలించిన కలెక్టర్
*ఎంపీ కృషితో కుక్కునూరు- భద్రాచలం రోడ్డు పనులు ప్రారంభం
*నూజివీడు: పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు
*చింతలపూడి: బ్రిడ్జి కూలుతోందని యువకుల ధర్నా
*కామవరపుకోటలో బైక్ చోరీ
*అగిరిపల్లెలో షార్ట్ సర్క్యూట్.. కోళ్ల ఫారం దగ్ధం
*జీలుగుమిల్లిలో ఓ వ్యక్తిపై దాడి

News March 18, 2025

కావలి గ్రీష్మ రాజీనామాకు ఆమోదం

image

AP: ఏపీ మహిళా కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పదవికి కావలి గ్రీష్మ ఈ నెల 9న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించగానే ఆమె రాజీనామా చేశారు. ఇటీవల ఆమె ఆ కోటాలో MLCగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News March 18, 2025

సీఎం తిరుపతి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

image

సీఎం చంద్రబాబు ఈనెల 20, 21వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. 20వ తేదీ తిరుపతి మీదుగా తిరుమల చేరుకుంటారు. 21వ తేదీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను అధికారులకు వివరించారు.

error: Content is protected !!