News November 1, 2025
సిబ్బందికి విజయనగరం ఎస్పీ కీలక ఆదేశాలు

కార్తీకమాసం సందర్భంగా ఆలయాలు, పిక్నిక్ స్పాట్స్ వద్ద తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అధికారులకు శనివారం ఆదేశించారు. భక్తులు పోలీసు సూచనలు పాటించాలని కోరారు. అవసరమైతే డయల్ 100/112కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి, క్యూలైన్లు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ తెలిపారు.
Similar News
News November 2, 2025
పర్యాటక ప్రోత్సాహానికి హోమ్ స్టే విధానం: కలెక్టర్

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు nidhi.tourism.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News November 2, 2025
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
News November 1, 2025
సహాయక చర్యల్లో విజయనగరం జిల్లా ఎస్పీ

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన భక్తులను ఆసుపత్రులకు తరలించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.


