News October 15, 2025
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డీఎంహెచ్ఓ

వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున క్షేత్రస్థాయిలో పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సూచించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో గర్భిణీ స్త్రీల నమోదును 12 వారాల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు.
Similar News
News October 15, 2025
ఐడియా అదిరింది కానీ.. సాధ్యమేనా!

దేశవ్యాప్తంగా వెండి ధరల్లో భారీ తేడాలున్నాయి. అహ్మదాబాద్లో కేజీ వెండి రూ.1,90,000 ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో అది రూ.2,07,000 ఉంది. అంటే ఏకంగా రూ.17,000 వ్యత్యాసం ఉందన్నమాట. దీనిపై ఒక నెటిజన్ ‘అహ్మదాబాద్లో కొని ఇక్కడ అమ్మితే ఖర్చులు, ట్యాక్సులు పోనూ రూ.14 వేలు మిగులుతాయి’ అని పోస్ట్ చేయగా తెగ వైరలవుతోంది. అయితే ఇది రియాల్టీలో సాధ్యం కాదని, లీగల్ సమస్యలొస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
News October 15, 2025
విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.
News October 15, 2025
Way2News కథనంతో RO ప్లాంటుకు మోక్షం

ఇంకొల్లులోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వద్ద టాయిలెట్లో అమర్చిన RO ప్లాంటు నుంచి వచ్చే తాగునీటి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై ‘<<18006504>>టాయిలెట్లో ఆర్వో ప్లాంట్<<>>.. ఇదేం చోద్యం..!’ శీర్షికన మంగళవారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు బుధవారం ఆ ప్లాంట్ను అక్కడి నుంచి తొలగించి వేరే రూమ్కు మార్చారు. సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.