News December 18, 2025
సిబ్బంది పనితీరు అద్భుతం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసి, ఎన్నికలను విజయవంతం చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News December 19, 2025
ఖమ్మం: ప్రశాంతంగా ముగిసిన పల్లె సమరం: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటించారు. మొత్తం 566 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలతో పాటు, 5,168 వార్డులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. విధుల్లో చిత్తశుద్ధితో పనిచేసిన సిబ్బందిని ఆయన అభినందించారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రజలకు, రాజకీయ పార్టీలకు కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News December 19, 2025
ఖమ్మం: మహిళా డెయిరీ ద్వారా 20 వేల మందికి లబ్ధి

ఖమ్మం జిల్లాలో ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మూడేళ్లలో 20 వేల మందికి లబ్ధి చేకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన పాడి పశువులను అందించాలన్నారు. పాల ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
News December 19, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల నేడు అమావాస్య, 20, 21 తేదీల్లో వారాంతపు సెలవులు కారణంగా వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తిరిగి ఈనెల 22 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.


