News March 1, 2025
సిబ్బంది సమస్యల పరిష్కారమే ధ్యేయం: కడప SP

కడప జిల్లాలో పోలీసు శాఖలో సిబ్బంది సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు ఎస్పీ అశోక్ శుక్రవారం స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది, వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఉన్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిశీలించి పరిష్కరించాలన్నారు.
Similar News
News February 21, 2026
కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్డ్లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.
News February 21, 2026
పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.
News February 21, 2026
మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.


