News October 15, 2024

సిరిమానోత్సవంలో ప్రజా ప్రతినిధుల సందడి

image

పైడితల్లి సిరిమానోత్సవ ఘట్టంలో పలువురు ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, తదితరులు సిరిమానుతో పాటు తిరిగి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిరిమాను ఘట్టం ముగింపు వరుకు పర్యటించి సందడి చేశారు.

Similar News

News October 15, 2024

VZM: సిరిమానోత్సవంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు

image

విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, శ్యాం ప్రసాద్ సందడి చేశారు. సిరిమాను రథంతో పాటు పర్యటించారు. మూడు సార్లు కూడా రథం ముందు నడిచి ముందుకు సాగారు. ఈ సందర్భంగా విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఉత్సవాల విజయవంతానికి సహకరించిన అధికార యంత్రాంగానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News October 15, 2024

DCCB బ్యాంకు ఆవరణ నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన బొత్స

image

ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎప్పటిలాగే DCCB బ్యాంకు ఆవరణ నుంచి పైడితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి.. అమ్మవారి సిరిమానును భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పైడిమాంబ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా బొత్స ఆకాంక్షించారు.

News October 15, 2024

కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన అశోక్ గజపతి

image

కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఎప్పటిలాగే కోట నుంచి సిరిమాను ఘట్టాన్ని తిలకించారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సిరిమానును దర్శించుకున్నారు. అశోక్‌తో కలిసి సిరిమాను ఘట్టాన్ని తిలకించిన వారిలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ నేత గొంప కృష్ణ, రాజ కుటుంబీకులు ఉన్నారు.