News March 23, 2024
సిరిసిల్లలో ఇద్దరు కార్యదర్శులు సస్పెండ్

సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ డీపీవో వీర బుచ్చయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండా గ్రామపంచాయతీ కార్యదర్శి పందిళ్ల రాజు, వేములవాడ రూరల్ మండలం నెమలి గుండపల్లి పంచాయతీ కార్యదర్శి హరి ప్రసాద్లను సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కావట్లేదని పేర్కొన్నారు.
Similar News
News February 2, 2026
కరీంనగర్ ‘పుర’పోరు.. మేయర్ పీఠంపై ముమ్మర వ్యూహాలు

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండగా.. ప్రధాన పార్టీలన్నీ మేయర్ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ BC జనరల్కు రిజర్వ కావడంతో హేమాహేమీలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తన అధికార బలాన్ని, BRS తన పట్టును, BJP ఎంపీ చరిష్మాను నమ్ముకున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉత్కంఠను రేపుతున్నాయి.
News February 2, 2026
కరీంనగర్కు దక్కని ‘పద్దు’ ఊరట

KNRకు బడ్జెట్లో మరోసారి నిరాశే ఎదురైంది. స్మార్ట్ సిటీకి నిర్మలమ్మ ‘పద్దు’ కరుణించలేదు. ఏళ్ల తరబడి ఊరిస్తున్న హసన్పర్తి రైల్వే లైన్, గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై స్పష్టత కరువైంది. టెక్స్టైల్ రంగానికి కొంత ఊరట ఉన్నా, జిల్లాకు ప్రత్యేక పారిశ్రామిక కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ నిరాశ కల్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
News February 2, 2026
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికలలో బరిలో 698 మంది

కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. మొత్తం 60 డివిజన్లలో 698 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. వీరు దాఖలు చేసిన 1,231 సెట్ల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తేలింది. నగరంలో కొత్తగా విలీనమైన 6వ డివిజన్ (బొమ్మకల్) లో అత్యధికంగా 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 32, 49వ డివిజన్లలో అత్యల్పంగా ఐదుగురు చొప్పున బరిలో ఉన్నారు.


